Save Elephant
Save Elephant : ఓ రైలు లోకోపైలెట్లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్ ఉత్తర బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ట్రాక్ పక్కన ఓ ఏనుగు నిలబడి ఉంది. దూరం నుంచి దాన్ని గమనించిన ఇద్దరు లోకోపైలెట్లు వెంటనే అలర్ట్ అయ్యారు.
COVID-19 ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే?
ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ దగ్గరి నుంచి అడవి లోపలికి వెళ్లేవరకు వేచి చూశారు. ఏనుగు వెళ్లిపోయాక రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అలీపూర్ద్వార్ డివిజన్ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు.
BH-series : రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్ మార్చనక్కరలేదు..ఒకే నంబర్ దేశమంతా తిరగొచ్చు..
ఆ వీడియో వైరల్గా మారింది. నెటిజన్లు లోకో పైలెట్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారంటూ మెచ్చుకుంటున్నారు. రైల్వే శాఖ కూడా ఆ ఇద్దరు లోకో పైలెట్లను అభినందించింది.
While working 03150Dn KanchanKanya Exp spl at 17.45 hrs today, Alert LP Sri D.Dorai & ALP Sri P. Kumar noticed One Tusker adjacent to track at KM 72/1 between Nagrakata-Chalsa & applied Emergency brake to control the train & save it. @RailNf@RailMinIndia @wti_org_india pic.twitter.com/TVyXt8HY9H
— DRM APDJ (@drm_apdj) August 25, 2021