మంగళవారం సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కేబినెట్ మీటింగ్ లో ఈ కంప్లీట్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు జులై-16నుంచి జులై 31వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కి సంబందించిన గైడ్ లైన్స్ సిద్దమవుతున్నట్లు అయన తెలిపారు.
బీహార్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1432 కరోనా ఇన్ఫెక్షన్లను గుర్తించినట్లు బీహార్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,853కు చేరుకోగా ,ఇప్పటివరకు 12,364మంది కోలుకున్నారు.
Lockdown to be imposed in the state from 16 to 31 July to curb the spread of #COVID19. Guidelines are being prepared: Bihar Deputy CM Sushil Kumar Modi (File pic) pic.twitter.com/sGz9AYicUO
— ANI (@ANI) July 14, 2020