Mumbai : బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ మాజీ మిస్ ఇండియా ఆదితి ఆర్యను పెళ్లాడారు. ముంబయి జియో కన్వెన్షన్లో జరిగిన వీరి పెళ్లి వేడుకలు వైరల్ అవుతున్నాయి.
Short Hair : జుట్టు పొట్టిగా ఉన్న మహిళలపై దాడి .. యువకుడు చెప్పే సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..
బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. 2015 మిస్ ఇండియా విన్నర్ అదితి ఆర్యను నవంబర్ 7 న పెళ్లాడారు. వీరి పెళ్లి వేడుక ముంబయి జియో కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ పేజీలలో తమ పెళ్లి విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘ నా వ్యక్తిని కనుగొన్నాను’ అనే క్యాప్షన్తో అదితి చేసిన పోస్ట్కి జే ‘ చాలా అందంగా ఉంది.. చాలా సొగసైనది.. జస్ట్ లుకింగ్ వావ్’ అని రిప్లై చేశారు.
వివాహ వేడుకలో జే కోటక్ షేర్వాణీలో, అదితి రెడ్ కలర్ లెహంగా ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. జే కోటక్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి హిస్టరి మరియు ఎకనామిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబిఏ పూర్తి చేసారు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్ అయిన Kotak811కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు జే కోటక్.
Mumbai Street : ముంబయి వీధిలో మహిళ ప్రసవం…పోలీసులు వచ్చి ఏం చేశారంటే…
అదితి ఆర్య ఢిల్లీ యూనివర్సిటీలోని షహీద్ సుఖ్ దేవ్ కాలేజ్ నుండి బిజినెస్ స్టడీస్లో ఫైనాన్స్ మేజర్ డిగ్రీ అందుకున్నారు. ఎర్నెస్ట్ & యంగ్లో రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేసారు. 2015 లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నారు. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2015 లో ఇండియాకి ప్రాతినిథ్యం వహించారు. అదితి 2021 లో రణ్వీర్ సింగ్ నటించిన ’83’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.