Colonel Santosh Babu : దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందారు. ఆ ఘటనలో సంతోష్తో సహా 21 మంది సోల్జర్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు మరణానంతరం కేంద్రప్రభుత్వం ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించింది. మంగళవారం సంతోష్ బాబు భార్య, ఆయన తల్లి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
చదవండి : Santhosh Babu : మోటివేషనల్ హాల్కు కల్నల్ సంతోష్ బాబు పేరు
ఇక ఉగ్రస్థావరాలపై దాడి చేసి 300 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్ సైన్యానికి చిక్కి.. తిరిగి స్వదేశానికి వచ్చిన అభినందన్ వర్ధమాన్కు కేంద్ర ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారం ప్రధానం చేసింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సోమవారం అభినందన్ కుటుంబ సభ్యులు అందుకున్నారు.
చదవండి : Colonel Santhosh Babu: కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం – కేటీఆర్