×
Ad

జూన్ 1నుంచి లాక్‌డౌన్ ఉండదు.. ఆగస్ట్ నుంచి వ్యాక్సిన్!

కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది.

  • Published On : May 22, 2021 / 02:44 PM IST

Coronavirus Lockdown No Covid 19 Lockdown Extention In Mp

కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది. అటువంటి పరిస్థితిలో, లాక్‌డౌన్ నియమాలను ఈ రాష్ట్రాల్లో సడలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఉపశమనం పొందే అవకాశం ఉన్నట్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌తో పరిస్థితులపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించారు. ఈ సమయంలో, ‘మేము జూన్ 1 నుండి నెమ్మదిగా అన్‌లాక్ చేస్తాము. ఇప్పుడు మేము కరోనా సంక్రమణను నియంత్రించే స్థితిలో ఉన్నాము. పాజిటివిటీ రేటు 5 శాతానికి పడిపోయింది, రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. 90 శాతానికి చేరుకుంది. మేము మునుపటి కంటే చాలా మంచి స్థితిలో ఉన్నాము. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 4,384 కరోనా వైరస్ సంక్రమణ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 79 మంది చనిపోయారు.

ఆగస్ట్ నుంచి స్పూత్నిక్-V:
ఆగస్టు నుంచి భారతదేశంలో స్పూత్నిక్-V వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు భారతదేశంలో 85 మిలియన్ మోతాదుల ఉత్పత్తి కానున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఢిల్లీలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అటువంటి పరిస్థితిలో, లాక్‌డౌన్ ఎత్తివేయవచ్చా లేదా ఆంక్షలను సడలించవచ్చా అనే విషయాలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచనలు జరుపుతుంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 3వేల కేసులు నమోదయ్యాయి. సంక్రమణ రేటు కూడా 5 శాతానికి తగ్గాయి.