Chhattisgarh Encounter
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కెర్లపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 20మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మావోలు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.