ఆ నలుగురు లేరు : తోపుడు బండిలో అంతిమయాత్ర

  • Publish Date - July 19, 2020 / 11:58 AM IST

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రప‌ంచ‌వ్యాప్తంగా ప‌లు హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రు ఏ కార‌ణంతో చ‌నిపోయినా క‌రోనా చావేమోనన్న భ‌యంతో జ‌నం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టంలేదు.

కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు. కరోనాతో చనిపోలేదు..తీసుకపోవాలని చెబుతున్నా..పట్టించుకోవడం లేదు. తాజాగా క‌ర్ణాట‌కలోని బెల‌గావి జిల్లా అథాని తాలూకాలో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

ఓ ఇంట్లో వ్యక్తి చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబ‌స‌భ్యులు అంద‌రికీ స‌మాచారం ఇచ్చారు. కానీ క‌రోనా భ‌యంతో ఎవ‌రూ చావుకు రాలేదు. అంతిమ‌యాత్రకు స‌హ‌క‌రించాల‌ని ఇరుగుపొరుగును ప్రాధేయ‌ప‌డినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబ‌స‌భ్యులే తోపుడు బండిపై శ‌వాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.