Covid Deaths Feb : ఈ నెలలో 15వేలు దాటిన కరోనా మరణాలు.. జూలై నుంచి ఇదే అత్యధికం..!

దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుతోంది. 2022 ఏడాది జనవరిలో కన్నా ఈ ఫిబ్రవరిలోనే కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది.

Covid Deaths Feb : దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుతోంది. కరోనా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉంది. రోజువారీ కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కానీ, కరోనా మరణాలు మాత్రం కొద్దిరోజులుగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 2022 ఏడాది జనవరిలో కన్నా ఈ ఫిబ్రవరిలోనే కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. శుక్రవారం (ఫిబ్రవరి 18) నాటికి కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది. గత ఏడాది జూలై నుంచి ఏడు నెలల్లో అత్యధికంగా కరోనా మరణాలు ఫిబ్రవరిలోనే నమోదయ్యాయి.

ఈ నెలలో కరోనా మరణాల సంఖ్య మొత్తంగా జనవరి (14,752) సంఖ్యను అధిగమించింది. కరోనా మహమ్మారి మొదటి, రెండు వేవ్ నుంచి నమోదు చేయని కరోనా మరణాలు ప్రస్తుత రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో 58శాతం మరణాలు (8,673) నమోదయ్యాయి. మిగిలిన 6,329 కరోనా మరణాలు గత నెలల్లో నమోదైన మరణాలకు జోడించారు. గత కరోనా మరణాలలో అత్యధికంగా 6,217 వరకు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో గతంలో కోవిడ్ మరణాల కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. అధికారిక కరోనా మరణాలను రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. అయితే, గుజరాత్ రాష్ట్రాలు మాత్రం అధికారిక కోవిడ్ మరణాల సంఖ్యను వేరుగా నమోదు చేశాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలు జూలై నుంచి అత్యధికంగా నమోదయ్యాయి.

కరోనా రెండో వేవ్ తగ్గే క్రమంలో దేశంలో 24,897 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అధికారికంగా 1,19,183 మరణాలు నమోదయ్యాయి. కరోనా రెండవ వేవ్ మేలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకు గత కరోనా మరణాలతో పాటు ఇటీవలి నమోదైన కరోనా మరణాలను కూడా కేరళ నివేదించింది. ఫిబ్రవరి 1 నుంచి 18వరకు దేశంలో మొత్తం కరోనా మరణాలు 8,673 నమోదు కాగా.. అందులో 2,927 వరకు కరోనా మరణాలు కేరళ నుంచే నమోదయ్యాయి. దాంతో కరోనా మరణాల్లో కేరళ మూడవ వంతు రాష్ట్రంగా నిలిచింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా 936, కర్ణాటక (759), బెంగాల్ (488), తమిళనాడు (406), గుజరాత్ (401) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా, జనవరితో పోలిస్తే.. ఫిబ్రవరిలో రెండు కొత్త కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి 18 రోజుల్లో 8,673 కరోనా మరణాలు నమోదయ్యాయి.

గతంలో కరోనా మరణాలు 9,269గా ఉన్నాయి. గత జనవరిలో 5,483 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటికే 6,329 మంది కరోనాతో మరణించారు. డిసెంబర్‌లో పాత కరోనా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. మొత్తంగా కరోనా మరణాల్లో 12,228 మందిలో 9,441 మంది ఉన్నారు. భారతదేశంలో శుక్రవారం (ఫిబ్రవరి 18) 22,191 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 నుంచి రోజువారీ కరోనా మరణాల సంఖ్య అత్యల్పంగా నమోదైంది. జనవరి 10 తర్వాత మొదటిసారిగా రోజువారీ కరోనా మరణాలు 200 కన్నా తక్కువకు (195) పడిపోయాయి. ఆ తర్వాత నమోదైన కరోనా మరణాల సంఖ్య 165గా ఉంది. కేరళలో అత్యధికంగా 61 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత కొన్ని రోజుల్లో నమోదైన కరోనా మరణాల్లో కర్ణాటక (19), మహారాష్ట్ర (15), ఒడిశా (15) ఉన్నాయి.

Read Also : Most Covid Deaths : దేశంలో కరోనా మరణాలు.. ఎక్కువగా గుండె లేదా కిడ్నీ వ్యాధుల కారణంగానే.. నివేదిక వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు