కొత్త ఆర్మీ చీఫ్ ఈయనే
- venkaiahnaidu
- Published On : December 30, 2019 / 04:14 PM IST
భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ్ గా మనోజో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1.3మిలియన్ల శక్తివంతమైన ఫోర్స్ ని లీడ్ చేసే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్ పేరును ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
తనను ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేయడం పట్ట మనోజ్ ముకుంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను ఇవ్వడం గౌరవంగా ఉందని అన్నారు. నూతన ఆర్మీ చీఫ్ గా నియమితులైన జనరల్ మనోజ్ ముకుంద్…తన 37 సంవత్సరాల సర్వీసులో వివిధ బాధ్యతలను నిర్వహించారు. శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా మనోజ్ ముకుంద్ ఒకడిగా ఉన్నారు.
మహారాష్ట్రకు చెందిన మనోజ్ ముకుంద్ మయన్మార్ లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లు భారత డిఫెన్స్ అటాచీగా కూడా పనిచేశారు. సెప్టెంబరులో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు..ఆర్మీ తూర్పు కమాండ్ కు నాయకత్వం వహించారు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్. ఇది చైనాతో భారతదేశం యొక్క దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దును చూసుకుంటుంది.
