Owaisi On Akhilesh Jinnah Remark : జిన్నాతో భారత ముస్లింలకు సంబంధం లేదు..అఖిలేష్ పై ఓవైసీ ఫైర్
పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను… మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లతో పోల్చుతూ
- venkaiahnaidu
- Published On : November 1, 2021 / 05:45 PM IST
Owaisi
Asaduddin Owaisi పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను… మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లతో పోల్చుతూ ఆదివారం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అఖిలేష్ యాదవ్ చరిత్రను చదువుకోవాలని ఓవైసీ సూచించారు.
ఆదివారం ఓ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ…సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు జిన్నా ఒకే ఇన్స్టిట్యూట్లో చదివి బారిస్టర్ అయ్యారు. వారు ఒకేచోట చదువుకున్నారు. వారు బారిస్టర్లు అయ్యారు. వారు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వారు ఎలాంటి పోరాటంలో పాల్గొనడం మానుకోలేదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..ఒక సిద్ధాంతంపై నిషేధం విధించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.
అఖిలేష్ వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ…ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఒక వర్గాన్ని సంతోషపెట్టవచ్చని అఖిలేష్ యాదవ్ భావిస్తే, అతను చేస్తున్నది తప్పు మరియు అతను తన సలహాదారులను మార్చుకోవాలి. అతను కూడా చదువుకోవాలి మరియు కొంత చరిత్ర చదవాలి. మహమ్మద్ అలీ జిన్నాతో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకోవాలి. మా పెద్దలు రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించారు మరియు భారతదేశాన్ని తమ దేశంగా ఎంచుకున్నారు అని AIMIM నాయకుడు ఇంకా జోడించారు.
అదేవిధంగా, ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..ఒక సిద్ధాంతంపై నిషేధం విధించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఇక,అఖిలేష్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి…విభజనకు విలన్గా మహమ్మద్ అలీ జిన్నాను దేశం పరిగణిస్తోందని.. జిన్నాను స్వాతంత్య్ర వీరుడిగా పేర్కొనడం ముస్లింలను మభ్యపెట్టే రాజకీయమన్నారు.
ALSO READ Yogi On Akhilesh Jinnah Remark : ఇది తాలిబనీ మనస్తత్వం..అఖిలేష్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందే
