ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్లు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో హౌసింగ్ సొసైటీలు, కాలనీల్లో సెక్యూరిటీ గార్డులు వాటి వల్ల తిప్పలు పడుతున్నారు. డెలివరీ ఆర్డర్లు ఒక్కదాని వెనుక ఒకటి వస్తుండడంతో వాటిని చాలా ప్రాంతాల్లో మొదట వాచ్మన్లు తీసుకుని, ఆ తర్వాత వాటిని ఆర్డర్లు చేసిన వారికి ఇస్తున్నారు. ఏ ఇళ్లు ఎక్కడ ఉందో వాచ్మన్లు చెప్పాల్సి ఉంటుంది.
డెలివరీ ఆర్డర్లు తీసుకుని వచ్చే డెలివరీ బాయ్స్కు వాచ్మన్లు ఓటీపీల వంటివి కూడా చెప్పాల్సి వస్తోంది. ఈ సమస్యపై ఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కాలనీ వాసులకు ఇచ్చిన నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నోటీసుకు సంబంధించిన వివరాలను ఎక్స్ యూజర్ షాజన్ ట్వీట్ చేశాడు.
ఆ నోటీసులోని వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో ఓ వ్యక్తి ఏడేళ్లుగా వాచ్మన్గా పనిచేస్తున్నాడని, అతడి బాధ్యతల నిర్వహణలో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతిరోజు అనేక పార్సిళ్లు వస్తుండడంతో వాటిని అతడు మేనేజ్ చేయలేకపోతున్నాడని చెప్పారు.
ఎఫ్ బ్లాక్లో నివసిస్తున్న బ్యాచిలర్లకు రోజూ 10-15 డెలివరీలు వస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఆర్డర్లను రోజుకు 1-2 కంటే ఎక్కువ చేయకూడదని ఆయన కోరారు. లేదంటే, సొసైటీ వద్దకు వచ్చే డెలివరీ బాయ్లతో సమన్వయం చేసుకోవడానికి సొంతంగా వాచ్మన్ను నియమించుకోవాలని చెప్పారు. సొంతంగా వాచ్మన్ను నియమించుకోవాలని ఆ సొసైటీ అధ్యక్షుడు చేసిన సూచనకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.
SOCIETY PRESIDENTS ARE INSANE!
My cousin’s building got a warning for receiving too many parcels in a day 😭😭 pic.twitter.com/Baj7vCKRtF
— shagun (@upshagunn) September 18, 2024
తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్మీట్లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్