Crime: భార్య కాళ్లను తాడుతో బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త

రోడ్డుకు ఆమె శరీరం గీరుకుపోయి రక్తం వచ్చింది. ఆమెను భర్త కొన్ని సెకన్ల పాటు అలాగే..

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ కాళ్లను తాడుతో బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్లాడు ఆమె భర్త. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాదాపు 40 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. బాధితురాలు సాయం కోసం కేకలు వేసినా ఆమెను ఎవరూ రక్షించలేదు.

రోడ్డుకు ఆమె శరీరం గీరుకుపోయి రక్తం వచ్చింది. ఆమెను భర్త కొన్ని సెకన్ల పాటు అలాగే లాక్కెళ్లాడు. బాధితురాలిపై దాడి జరుగుతున్న సమయంలో నిందితుడి బంధువులు మరో ముగ్గురు అక్కడే ఉన్నట్లు సమాచారం. జైసల్మేర్‌లో ఉన్న తన సోదరిని చూడడానికి వెళ్తానని చెప్పినందుకే బాధితురాలి భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఆ ప్రాంతం వారు వేరే రాష్ట్రాల నుంచి మహిళను భార్యగా కొనుగోలు చేసి తెచ్చుకుని, వేధింపులకు గురి చేస్తుంటారని తెలుస్తోంది. బాధితురాలిని నిందితుడు బిహార్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను చూడడానికి వెళ్తామని చెబితే ఇటువంటి దారుణాలకు పాల్పడుతుంటారు.

Also Read: అయ్యయ్యో… ఆ డ్రైవర్ కు ఏమైంది.. ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టిన బస్సు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు