Vehicle Scrappage Policy
Vehicle Scrappage Policy: 15ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అలాంటి వాహనాలను వినియోగించవద్దని సూచించింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రయాణీకుల భద్రత, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, వాహనాలను స్క్రాప్ చేసే నిబంధనలను పున: పరిశీలించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Vehicle Scrappage Policy : వాహనాల తుక్కు పాలసీ ప్రారంభించిన మోదీ
పాత వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్దరణ విషయంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (రవాణా శాఖ) ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాలో 2022 ఏప్రిల్ 1 తర్వాత 15సంవత్సరాల వాహనాలను రెన్యూవల్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిక ప్రాంతాలు, పీఎస్యులు, మున్సిపల్ బోర్డు మోదలైన అన్ని రకాల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండ్స్ ద్వారా ఈ ఆర్డర్ గురించి సమాచారం ఇచ్చింది.
Scrappage Policy: వెహికల్ స్క్రాపేజ్ పాలసీ.. 25శాతం రోడ్డు ట్యాక్స్ రద్దు
దేశంలో కాలుష్యం స్థాయిని తగ్గించడానికి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోవడానికి, ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఇప్పుడు ఏ ప్రభుత్వ శాఖకూడా 15 సంవత్సరాల కంటే పాత వాహనాన్ని ఉపయోగించకూడదని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.