India Covid
Covid-19 : దేశంలో నిన్న కొత్తగా 2,745 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆరుగురు కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 18,386 యాక్టివ్ covid కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,31,60,832 కు చేరగా కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 5,24, 636కి చేరింది. దేశంలో కోవిడ్ కారణంగా మొదటి మరణం మార్చి 2020 లో నమోదయ్యింది.
దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కాగా నిన్న కోవిడ్ నుంచి 2,236మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు Covid నుంచి కోలుకున్న వారి సంఖ్య4,26,17,810కి చేరింది.
Also Read : Social Media : ఏపీ సంక్షేమ పధకాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం-కేసు నమోదు