Mangoes : కిలో రూ.2.5 లక్షలు విలువైన మామిడి పండ్లు చోరీ.. పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే

అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.

Mangoes

Odisha Naupada : ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఓ ఫామ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ.2.5 లక్షలు పలికే మామిడి పండ్లను దొంగిలించారు. తోట యజమాని పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీ నారాయణన్ అనే రైతు తన తోటలో 38 వెరైటీల మామిడి పండ్లను సాగు చేశారు.

తన మామిడి రకాలకు మార్కెట్ లో అత్యంత గిరాకీ ఉండటంతో ఉద్వేగానికి లోనైన ఔత్సాహిక రైతు ఈ విషయం సోషల్ మీడియాలో పంచుకోవాలని ఫొటోలను షేర్ చేశారు.

High Court Notice : ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. ఫొటో పోస్టు చేసిన ఒక్క రోజులోనే తన తోట నుంచి నాలుగు ఖరీదైన మామిడి పండ్లు చోరీ కావడంతో తోట యజమాని సహా స్థానికులు విస్తుపోయారు.

ట్రెండింగ్ వార్తలు