Chennai Super Kings Team
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సీఎస్కే జట్టు మ్యాచ్ ఆడుతుంటే చాలా మంది టీవీలకు అతక్కుపోతారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడంటే ఆ జట్టు అభిమానులకు పూనకాలు వచ్చినట్లే. తమిళులు జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ పలుసార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచింది. అయితే, సీఎస్కే జట్టును ఐపీఎల్ నుంచి నిషేధించాలని తమిళనాడు అసెంబ్లీలో డిమాండ్ వినిపించింది. పీఎంకే (పాటలి మక్కల్ కట్చీ) పార్టీ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర క్రీడాశాఖపై చర్చ జరిగింది. ఈ క్రమంలో పీఎంకే పార్టీ చెందిన బామగకు చెందిన ధర్మపురి వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ డిమాండ్ ను లేవనెత్తారు.
సీఎస్కే జట్టును నిషేధించాలని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఉందని వెంకటేశ్వరన్ చెప్పారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే తమిళనాడు జట్టుగా ప్రతిఒక్కరూ గుర్తిస్తారని, తమిళనాడు పేరు పెట్టుకున్న ఆ జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ లేకపోవటం సిగ్గుచేటని, అందుకే ఆ జట్టును నిషేధించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, తమిళనాడు పేరు చెప్పుకొని ఆడుతున్న జట్టులో తమిళ ప్లేయర్ ఒక్కరు లేకపోయినా క్రీడాశాఖ ఎందుకు స్పందించటం లేదని అసెంబ్లీ వేదికగా వెంకటేశ్వరన్ ప్రశ్నించారు. వెంటనే తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించాలని శాసనసభలో పట్టుబట్టాడు.
IPL 2023: ఐపీఎల్లో విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టేది అతడే : రవిశాస్త్రి
తమిళనాడులో క్రికెటర్లు లేరా? ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎవరూ కనిపించడం లేదా? అని వెంకటేశ్వరన్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెన్నై టీంపై చర్యలు తీసుకోవాలని, ఆ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడింది. అందులో రెండు మ్యాచ్ లు గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.