Indian Navy : వాణిజ్య నౌక దాడి ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో భారత్ మూడు యుద్ధ నౌకల మోహరింపు
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....
- saleem sk
- Published On : December 26, 2023 / 09:50 AM IST
Navy warships
Indian Navy : వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది. భారత నావికాదళం నిరోధక ఉనికిని కొనసాగించడానికి ఈ ప్రాంతంలో నిఘా విమానాలు, యుద్ధనౌకలను మోహరించింది. న్యూ మంగుళూరు నౌకాశ్రయానికి వెళుతున్నప్పుడు అరేబియా సముద్రంలో భారతదేశ పశ్చిమ తీరంలోని ఓడ డ్రోన్తో ఢీకొంది.
ALSO READ : Dense Fog : పలు రాష్ట్రాల్లో కమ్ముకున్న పొగమంచు…ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం
ఈ ఘటన తర్వాత డ్రోన్ దాడికి గురైన వ్యాపార నౌక ఎంవీ కెమ్ ప్లూటో ముంబయి నౌకాశ్రయానికి చేరుకుంది. నావికాదళం నిఘా కోసం పి-8I దీర్ఘ-శ్రేణి గస్తీ విమానాలను మోహరించింది. అరేబియా సముద్రంలో గస్తీ కోసం యుద్ధనౌకలు ఐఎన్ఎస్ మోర్ముగో, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతాను మోహరించినట్లు నేవీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో హౌతీ మిలిటెంట్లు వివిధ వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు.
ALSO READ :
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో మూడు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లను మోహరించినట్లు నేవీ అధికారి తెలిపారు.25 మంది భారతీయ సిబ్బందితో కూడిన గాబన్ జెండాతో కూడిన వాణిజ్య ముడి చమురు ట్యాంకర్ శనివారం దక్షిణ ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడికి గురైంది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని భారత అధికారులు, యుఎస్ మిలిటరీ తెలిపింది.
