NIA Raids
NIA Raids : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల బృందాలు శనివారం ఆకస్మిక దాడులు జరిపాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. కర్ణాటకతోపాటు మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ALSO READ : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి
విదేశీ ఐఎస్ఐఎస్ తో ఉన్న సంబంధాల కుట్రను ఎన్ఐఏ ఛేదించింది. భారతదేశంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తుల గుట్టును ఎన్ఐఏ అధికారులు రట్టు చేశారు. ఈ తీవ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరాలను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గతంలో ఎన్ఐఏ జరిపిన దాడుల్లోనూ ఐఎస్ఐఎస్ కుట్ర కోణం వెలుగుచూసింది.
ALSO READ : Former Telangana CM KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్?
దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది. ఈ దాడుల అనంతరం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలున్న వారిపై కేసులు పెడతామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు జరుపుతున్న దాడులు సంచలనం రేపాయి.