మాకు కావాల్సింది గొప్పలు కాదు.. ప్రాణాలు కాపాడటమే: కేజ్రీవాల్

మాకు కావాల్సింది గొప్పలు కాదు.. ప్రాణాలు కాపాడటమే: కేజ్రీవాల్

Updated On : June 29, 2020 / 3:45 PM IST

ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటంతో సీఎం ప్రతి ఒక్కరినీ అలర్ట్ అవ్వాలని కోరారు. గొప్పలు చెప్పుకోవడం మా లక్ష్యం కాదని… ప్రాణాలు కాపాడటమే అని కేజ్రీవాల్ అన్నారు. ‘ప్రాణాలు కాపాడటానికి నా గుండె, ప్రాణాలు కూడా అర్పిస్తా. గొప్పలు చెప్పుకోవల్సిన అవసరం లేదు. దీన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు’ అని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కరోనావైరస్ ను హ్యాండిల్ చేయడం ఏ ఒక్క ప్రభుత్వం వల్ల కాదు. మరిన్ని ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఇటీవల రోజుల్లో మరిన్ని కేసులు పెరిగిపోతున్నాయి. అప్పుడే మేమింకా ఎక్కువ చేయగలం’ అని అన్నారు.

ఊహించిన దానికంటే బెటర్:
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 5.5లక్షల కేసులు నమోదవుతాయని భావించారు. ప్రజలకు తెలియజేయడం నా బాధ్యత. మా కష్టాలు ఫలిస్తున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న మొత్తం 27వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టే తెలుస్తుంది అనుకున్నదానికంటే బెటర్ అని..’ సీఎం అన్నారు.

ప్రజలు అంతకుముందులా భయపడటం లేదు. చాలామంది ఇంటి వద్దనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హాస్పిటల్స్ పై భారం తగ్గుతుంది. సీరియస్ గా ఉన్న పేషెంట్లను కాపాడేందుకు ఢిల్లీ హాస్పిటల్స్ లో సరిపడా బెడ్స్ ఉన్నాయి. మేమేం కూర్చొని ఉండిపోలేదు. పనిచేస్తూనే ఉన్నాం. కలిసి పనిచేయడం అనేది పెద్ద బలం. కరోనా నుంచి రివరీ అయిన పేషెంట్లకు రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రాణాలు కాపాడటానికి వారి ప్లాస్మాను డొనేట్ చేయండి. అది ఇంకొకరి ప్రాణాలు కాపాడవచ్చు’

‘మరో 2రోజుల్లో ప్లాస్మా బ్యాంక్ స్టార్ట్ అవుతుంది. COVID-19పేషెంట్లు వారి ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నాం’ అని వెల్లడించారు.

Read:లడఖ్ ప్రతిష్టంభన : భారత్‌కు ఆయుధాలు, మందుగుండు పంపిస్తున్న మిత్రదేశాలు!