PM Modi : కాశీలో అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

 వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలోని సర్వవేద్ మహామందిర్‌లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు.

PM Modi..Biggest Meditarion center in Varanasi : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు.వారణాసిలోని సర్వవేద్ మహామందిర్‌లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఏడు అంతస్థుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000మంది ధ్యానం చేసుకునే ఏర్పాటు చేశారు.

ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతు..ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను మంత్రముగ్ధుడినయ్యానని..వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత, మహాభారతం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా సంతోషంగా అనిపించిందన్నారు.

సాధువల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి, నవ నిర్మాణంపరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నాు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని అన్నారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందన్నారు.