Bharat Jodo Yatra: మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మూడోరోజు యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు సాగారు. శుక్రవారం ఉదయం నాగర్‌కోయిల్‌లోని స్కాట్ క్రిస్టియన్ కళాశాల నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ఉదయం 10గంటలకు పులియూరుకురిచిలోని ముట్టిడిచన్ పార్లి చర్చికి చేరుకుంది. పాదయాత్ర పొడవునా ఉన్న ప్రజలలకు కరచాలనం చేసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. పలుప్రాంతాల్లో రాహుల్ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్ర రాత్రి 7గంటలకు కన్యాకుమారిలోని అళగియమండపం జంక్షన్ వరకు చేరుకుంటుంది.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

ట్రెండింగ్ వార్తలు