Minister Rajnath Singh: మన రక్షణ దళాల చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్లోని చమోలీలో ఔలీ మిలిటరీ స్టేషన్ లో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రోచ్ఛారణల మధ్య రాజ్నాథ్ సింగ్ ఆయుధాలకు పూజలు చేశారు. సైనికులు దేశభక్తి గీతాలను ఆలపించారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆయుధాలకు పూజలు, ప్రార్థనలు జరిగే ఏకైక దేశం భారతదేశమని చెప్పారు. మన రక్షణ దళాలు, పారామిలిటరీ దళాల జవాన్లు మన దేశానికి గుర్వకారణమని పేర్కొన్నారు. మన రక్షణ దళాల చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందని అన్నారు.