Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో సంజయ్ దత్, సునీల్ శెట్టి

  • Published On : October 10, 2023 / 06:30 AM IST

Sanjay Dutt, Suniel Shetty

Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ సినీనటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి లు కూడా ఉన్నారని తాజాగా ఈడీ విచారణలో వెల్లడైంది. లయన్ బుక్ యాప్ సక్సెస్ పార్టీ గత ఏడాది సెప్టెంబర్ 20వతేదీన దుబాయ్‌లోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో జరిగింది. ఈ పార్టీకి సంజయ్ దత్, సునీల్ శెట్టి తదితరులతో సహా పలువురు బాలీవుడ్ నటులు హాజరైనట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.

Also Read :Ladakh : లడఖ్‌లో మళ్లీ హిమపాతం…సైనికుడి మృతి, నలుగురు గల్లంతు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మహదేవ్ బుక్ యాప్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్, పాకిస్థాన్ దేశాల్లో ది లయన్ బుక్ యాప్ నడుపుతున్నట్లు తేలింది. యూఏఈలో మహదవ్ బుక్ యాప్ ప్రమోటర్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు హాజరయ్యారని వెల్లడైంది. చంద్రకర్ ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్ వంటి బాలీవుడ్ పెద్దలు హాజరయ్యారు. బాలీవుడ్ సింగర్లు విశాల్ దద్లానీ, నేహా కక్కర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

Also Read :Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి

ఈ కేసులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇటీవల చంద్రకర్‌, ఉప్పల్‌లకు ఆస్ట్రేలియాలో ప్రవేశం నిరాకరించి తిరిగి యూఏఈకి పంపించారు. సెంట్రల్ ఏజెన్సీ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు వీరిద్దరిపై ఆగస్టులో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. వారు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది.