Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు కింద పడిన కారు, ఆరుగురి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు....

Road Accident

Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

ALSO READ : Heavy Rain Alert : పలు జిల్లాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ

కారు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా చాపర్ ప్రాంతంలోని రాంపూర్ క్రాసింగ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ట్రక్కును ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కారు ప్రమాదంలో ఆరుగురి ప్రాణాలను బలిగొంది.

ALSO READ :  Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

మృతులు ఢిల్లీలోని షహదారా నివాసితులని ముజఫర్‌నగర్ జిల్లా పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు