Supreme Court: సైబర్ ఉచ్చులో చిన్నారులు.. సుప్రీమ్ కోర్ట్ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రానికి కీలక నోటీసులు జారీ
చిన్నారులు సామాజిక మాధ్యమాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్న నేపథ్యంలో భారత అత్యున్నత నాయస్థానం (Supreme Court) అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.
- V Santhosh Kumar
- Published on- September 10, 2026 / 03:25 PM IST
Supreme Court notices Centre about social media usage and children online safety
- సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
- చిన్నారుల రక్షణకు హద్దులు తప్పనిసరి
- కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
Supreme Court: చిన్నారులు సామాజిక మాధ్యమాలు, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్న నేపథ్యంలో భారత అత్యున్నత నాయస్థానం (Supreme Court) అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లు డిజిటల్ వేదికలను చాలా సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉన్నందున, వారికి తగిన రక్షణ కల్పించేలా కచ్చితమైన హద్దులు, నిబంధనలు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో పిల్లల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆన్లైన్ వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ.. పిటిషన్పై విచారణ వేళ ధర్మాసనం ఆదేశాలు:
మైనర్లు సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికలను ఉపయోగించే సమయంలో సైబర్ వేధింపులు, ప్రమాదకర కంటెంట్ బారిన పడకుండా సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సమగ్రంగా విచారించింది. విచారణ సందర్భంగా ఆన్లైన్ వేధింపుల నుంచి పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, భవిష్యత్తులో ఎలాంటి విధానాలు అమలు చేయబోతున్నారో వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సమన్లు.. తదుపరి చర్యలపై ముమ్మర చర్చ:
ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం అధికారిక నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ కంటెంట్ పర్యవేక్షణ, వయస్సు నిర్ధారణ నిబంధనలు, డిజిటల్ సెక్యూరిటీ ప్రమాణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో తెలపాలని ఆదేశించింది. చిన్నారుల మానసిక, శారీరక భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే సరికొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
