Rajiv Gandhi Murder Case : విషమించిన తల్లి ఆరోగ్యం.. నళినికి నెల రోజుల పెరోల్
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్కు తమిళనాడు ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసినట్లు మద్రాస్ హైకోర్టు గురువారం తెలిపింది
- kunduru Vinod
- Published On : December 24, 2021 / 07:42 AM IST
Rajiv Gandhi Murder Case
Rajiv Gandhi Murder Case : రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్కు తమిళనాడు ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసినట్లు మద్రాస్ హైకోర్టు గురువారం తెలిపింది. నళిని తల్లి ఎస్ పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ గురువారం తదుపరి విచారణకు రాగా, న్యాయమూర్తులు పిఎన్ ప్రకాష్, ఆర్ హేమలతలతో కూడిన డివిజన్ బెంచ్కు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ హసన్ మహ్మద్ నళిని తల్లి ఆరోగ్యంపైతె లిపారు.
చదవండి :
పద్మ తన పిటిషన్లో తాను వివిధ వ్యాధులతో బాధపడుతున్నానని, తన కుమార్తెను తన మంచం పక్కన ఉండాలని కోరింది. దీనికి సంబంధించి ఆమె ఒక నెలపాటు పెరోల్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలు పంపగా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి :
కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 21, 1991న శ్రీపెరంబుదూర్లో LTTE ఆత్మాహుతి బాంబు దాడిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో మురుగన్, సంతన్, పెరరివాలన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్, నళిని అనే ఏడుగురు వ్యక్తులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
