UP Farmer Climbs Tree: పగబట్టిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే రైతు.. వీడియో వైరల్.. అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర ట్వీట్
ఖఖ్ను అనే రైతు వెంట ఓ ఎద్దు పడింది. భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైతు చెట్టెక్కాడు. అయినా వదలకుండా రెండు గంటలపాటు రైతు చెట్టు దిగితే దాడిచేయాలని ఎద్దు కాచుకొని కూర్చుకుంది.
- Harish Thanniru
- Updated on- July 31, 2023 / 11:34 AM IST
UP farmer climbs tree
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బలియా జిల్లా (Ballia District) లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు రైతును ముప్పుతిప్పలు పెట్టింది. పొలంలో పనిచేస్తున్న రైతును పొడిచేందుకు పరుగెత్తుకుంటూ ఎద్దురావడంతో అప్రమత్తమైన రైతు దాని నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు చెట్టెక్కాడు. అయినా ఆ ఎద్దు వదిలిపెట్టలేదు. రైతుపై పగబట్టినట్లుగా రెండు గంటలపాటు చెట్టవద్దనే నిలబడింది. దీంతో రైతు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చివరికి కొందరు రైతులు అక్కడికి చేరుకొని దానిని తరిమేశారు. ఆ తరువాత హమ్మయ్య బతికిపోయా అనుకుంటూ రైతు చెట్టు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jaipur Express Train : జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి
శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఖఖ్ను అనే రైతు వెంట ఓ ఎద్దు పడింది. భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైతు చెట్టెక్కాడు. అయినా వదలకుండా రెండు గంటలపాటు రైతు చెట్టు దిగితే దాడిచేయాలని ఎద్దు కాచుకొని కూర్చుకుంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. అయితే, ప్రభుత్వం తీరుపై అఖిలేష్ మండిపడ్డారు. అఖిలేష్ ఆగ్రహం వెనుక కారణం ఉంది. రైతును చెట్టెక్కేలా చేసిన ఎద్దు.. గత కొన్నిరోజులుగా 12 మందిని గాయపర్చిందట.
ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఈ ప్రాంతంలో దారితప్పిన ఆవులను ఇప్పటి వరకు దాదాపు 3,910 వరకు సంరక్షణ కేంద్రాలకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం రైతును బయటపెట్టిన ఎద్దును పట్టుకొనేందుకు ఓ బృదం రంగంలోకి దిగింది. అయితే, రైతును చెట్టు దిగకుండా రెండు గంటలపాటు కాపులా కాసిన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో నవ్వులుపూయించే కామెంట్లు చేస్తున్నారు.
बलिया में आवारा सांड से जान बचाने के लिए एक किसान करीब 2 घंटे तक पेड़ पर बैठा रहा, वीडियो वायरल होने के बाद डीएम ने संज्ञान लिया!!#Ballia #UttarPradesh pic.twitter.com/5LpQqUNHnW
— Gaurav Dixit (@GauravKSD) July 28, 2023
