viral video
viral video : మెట్రోలు అయిపోయాయి.. ఇక జనాలు ఫుట్ పాత్లు, రోడ్లు డ్యాన్స్ ఫ్లోర్లులాగ వాడేసుకుంటున్నారు. భారీ వర్షంలో తడుస్తూ “తుమ్ సే హీ” అంటూ ఓ జంట పాట పాడుకున్నారు. ‘జబ్ వి మెట్’ సినిమాలో పాటను రిక్రియేట్ చేసారు. క్యూట్ నెస్ తగ్గిందని నెటిజన్లు పెదవి విరిచారు.
@theLostFirsbee అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘జబ్ వి మెట్’ సినిమా గుర్తుందా?.. షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించారు. అందులోని ‘తుమ్ సే హీ’ రొమాంటిక్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటను ఓ జంట వర్షంలో మళ్లీ రిక్రియేట్ చేసారు. అయితే జంట చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. అయితే ఓవైపు భారీ వర్షం, రోడ్డుపై వెళ్తున్న వాహనాలు.. వారినే గమనిస్తున్న జనం అయినా ఇవేమీ పట్టించుకోకుండా డేర్గా ఆ జంట వేసిన స్టెప్పులు చూసి మెచ్చుకోకుండా ఉండలేం.
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్లో ‘కాంత లగా’ పాట పాడుతూ డ్యాన్స్ చేసిన ప్రయాణికులు
‘ఫుట్ పాత్లు భారతదేశంలో డ్యాన్స్ ఫ్లోర్లు’ అని ఒకరు.. ‘పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసేవరకూ అంతా బాగానే ఉంటుందని’ మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. సినిమాల్లో జంటలు డ్యూయెట్లు పాడుకోవడాలు చూసాం. ఇకపై రియల్ లైఫ్లో అందరూ రోడ్లపై పాటలు పాడుతుంటే చూడాలేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు.
This Or Nothing ??❤️
Najar na lge ? pic.twitter.com/OkG6S5dEjG— Anu. (@theLostFirsbee) July 7, 2023