×
Ad

CM Jagan : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే.. ఫొటో గ్యాలరీ

ఏపీలోని సీమ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు.

1/17
ఏపీలోని సీమ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.
2/17
గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు.
3/17
తర్వాత హెలికాప్టర్‌ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు.
4/17
భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.
5/17
ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు.
6/17
ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు.
7/17
పింఛ ప్రాజెక్టుతోపాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు.
8/17
తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.
9/17
తిరుపతి టౌన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
10/17
సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.
11/17
ఏపీలోని సీమ జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.
12/17
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే
13/17
ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్‌ సర్వే
14/17
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్
15/17
వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు.
16/17
రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడారు.
17/17
జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు.