రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన యువ గళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లోకేశ్ కు అభినందనలు తెలిపారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.