Ratha Saptami At Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు భక్తులను కటాక్షించారు. అదేవిధంగా చిన్నశేష వాహనంపై శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనం సేవ అన్ని దివ్య వైభవంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.