Home » Photo-gallery » Team India Has A Great Victory Over Sri Lanka In The Third Odi
India vs sri lanka 3rd ODI: సిరీస్ క్లీన్స్వీప్.. మూడో వన్డేలో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. ఫొటో గ్యాలరీ
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 166 పరుగులు చేయగా, శుభ్ మన్ గిల్ 116 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 42 పరుగులతో రాణించారు. తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 73 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా వాండర్సే బ్యాటింగ్ కు దిగలేదు. శ్రీలంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టీమిండియా బౌలర్ సిరాజుద్దీన్ నాలుగు వికెట్లు తీశారు. మూడో వన్డేలో భారీ విజయంతో టీమిండియా సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.