Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్‌పై దాడి వెనుక కుట్ర ఉంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.

Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్ పై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ దాడి ఆకతాయిల చర్యల కాదన్న సజ్జల.. దీని వెనుక కుట్ర ఉందన్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్ధరహితం అని విరుచుకుపడ్డారు. జగన్ పై దాడి వెనుక ఉన్న వారు కచ్చితంగా బయటకు రావాలన్నారు. ఈ దాడి వెనుక బోండా ఉమ లేక ఆయనకంటే పెద్ద వాళ్లు ఉన్నారా? అనే విషయం విచారణలో తేలుతుందన్నారు. తప్పు చేసిన ప్రతి వ్యక్తి.. తనను ఇరికిస్తున్నారని మాట్లాడితే చెల్లుతుందా? అని ప్రశ్నించారు సజ్జల.

”సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే. ఇది ఆకతాయిల చర్య కానే కాదు. సీఎం జగన్ పై దాడి ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం. ఈ ఘటన వెనుకన్న వారు బయటకు రావాలి. వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? దీని వెనుకున్నది బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది. తప్పు చేసిన ప్రతీ వ్యక్తి.. నన్ను ఇరికించాలని చూస్తున్నారు అని మాట్లాడితే చెల్లుతుందా? అని సజ్జల ప్రశ్నించారు.

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ LED ప్రచార రథాలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈ రథాలు తిరగనున్నాయి. ఎన్ఆర్ఐలు స్వచ్చందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చెయ్యడం సంతోషం అని సజ్జల అన్నారు. సీఎం జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో మళ్ళీ సీఎం జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని సజ్జల అన్నారు.

Also Read : సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్.. కోర్టుకు తరలింపు

ట్రెండింగ్ వార్తలు