AP మూడు రాజధానులపై మంత్రి KTR ట్వీట్
- madhu
- Published On : December 29, 2019 / 01:28 PM IST
ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలివిగా సమాధానం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు, నిరసనలు హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..2019, డిసెంబర్ 29వ తేదీ మంత్రి కేటీఆర్ #AskKTR పేరిట ట్విట్టర్ వేదిగాక నెటిజన్ల ముందుకు వచ్చారు.
వారు అడిగిన ప్రశ్నలకు టకటక సమాధానం చేప్పేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించారు. అంతేగాకుండా…ఆరు నెలల సీఎం జగన్ పాలనపై స్పందించాలని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. బాగానే ప్రారంభించాడని అనుకుంటున్నట్లు తెలిపారు. యు ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటీ ? రాజధాని, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆరన్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. అది నిర్ణయించేది తాను కాదు..ఏపీ ప్రజలు అంటూ ట్వీట్ ద్వారా ఆన్సర్ ఇచ్చారు.
Read More : బస్తీ మే సవాల్ : పురపోరుకు TRS సై..క్లీన్ స్వీప్ లక్ష్యం
ఇంకా ఇతర అంశాలపై కూడా ఆయన స్పందించారు.
ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు మీకు స్పూర్తి అని అడిగితే..మరో ఆలోచన లేదు..KCR అంటూ చెప్పారు.
ఆర్థిక సంక్షోభం, కులం – మతం రాజకీయాలు, పేదరికి ఏది భారత్ కు అసలైన సవాల్ అంటే..రాజకీయాలను – ఆర్థిక వ్యవస్థలను బ్యాలెన్స్ చేయడం సవాల్ అన్నారు.
LB Nagar ఫ్లై ఓవర్ ఎప్పటికి పూర్తవుతుందని అంటే..ఇప్పటికే ఒకటి పూర్తయ్యింది..మిగతా మూడు త్వరలోనే పూర్తయితాయన్నారు.
ఇలా ఎన్నింటికో ఆయన సమాధానం ఇచ్చారు.
Well, that’s up to the people of AP to judge. Not me https://t.co/7vB1WqfYZD
— KTR (@KTRTRS) December 29, 2019
