Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మహిళల టీ20 క్రికెట్లో ఏకైక ప్లేయర్..
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 20, 2026 / 11:07 AM IST
Asian Games 2026 Smriti mandhana Creates history to becomes Most runs in wqmens WT20Is
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్తో సెమీస్ మ్యాచ్లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఈ ఘనతను అందుకుంది.
ఈక్రమంలో ఆమె న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ను అధిగమించింది. 186 మ్యాచ్ల్లో బేట్స్ 4758 పరుగులు చేయగా మంధాన కేవలం 178 మ్యాచ్ల్లోనే ఆమెను అధిగమించింది.
Shreyanka Patil : జపాన్లో భారత మహిళా క్రికెటర్.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్..
ఈ మ్యాచ్లో మంధాన 19 బంతులు ఎదుర్కొంది. 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్కు 72 పరుగులు జోడించింది.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 178 మ్యాచ్ల్లో 4788 పరుగులు
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 186 మ్యాచ్ల్లో 4758 పరుగులు
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 209 మ్యాచ్ల్లో 4287 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 172 మ్యాచ్ల్లో 4282 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 158 మ్యాచ్ల్లో 3817 పరుగులు
🚨 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐀𝐋𝐄𝐑𝐓 🚨@mandhana_smriti is now the leading run-getter in Women’s T20I history 🫡👏
Updates ▶️ https://t.co/zMJKYRAVhE#TeamIndia | #AsianGames pic.twitter.com/kmj5gWqFiy
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
