కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు హార్దిక్ భార్య నటాషా.. వీడియో వైరల్
బుధవారం తెల్లవారుజామున కుమారుడుతో కలిసి నటాషా ముంబయి విమానాశ్రయం నుంచి సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
![కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు హార్దిక్ భార్య నటాషా.. వీడియో వైరల్ కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు హార్దిక్ భార్య నటాషా.. వీడియో వైరల్](https://10tv.in/wp-content/uploads/2024/07/Hardik-Pandya-and-Natasa-Stankovic.jpg)
Hardik Pandya and Natasa Stankovic
Hardik Pandya Wife Natasa : భారత్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, ఆయన సతీమణి నటాషా స్టాంకోవిచ్ మధ్య విడాకుల వ్యవహారంపై గతకొద్దికాలంగా చర్చ జరుగుతుంది. వారు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో త్వరలో వారు విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై హార్దిక్, నటాషా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొడుకు అగస్త్యను తీసుకొని నటాషా స్టాంకోవిచ్ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బుధవారం తెల్లవారుజామున కుమారుడుతో కలిసి నటాషా ముంబయి విమానాశ్రయం నుంచి సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిల్లో హార్దిక్ పాండ్యా ఎక్కడా కనిపించలేదు. దీనికితోడు నటాషా తన ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. లాగేజీతో కూడిన ఫొటోకు ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ కన్నీళ్లతో కూడిన ఎమోజీ, విమానం, ఇల్లు, హార్ట్ సింబల్ ఎమోజీని షేర్ చేసింది.
Also Read : బుమ్రాను దించేశాడు..! బుమ్రా స్టైల్లో బౌలింగ్ చేస్తున్న బుడ్డోడిని చూశారా.. వీడియో వైరల్
మరోవైపు త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉండనని హార్దిక్ పాండ్యా బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో ఉండలేక పోతున్నానని పేర్కొన్నట్లు సమాచారం. భార్య నటాషాతో విడాకులు తీసుకోవడం కోసమే హార్దిక్ శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram