India women win Kabaddi World Cup 2025
Womens Kabaddi World Cup : మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో (Womens Kabaddi World Cup) అడుగుపెట్టిన భారత్ వరుస విజయాలతో మరోసారి విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీని చిత్తు చేసింది. 35-28 తేడాతో ఓడించి సగర్వంగా ప్రపంచకప్ను ముద్దాడింది. 11 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
ఈ టోర్నీ లీగ్ దశలో భారత్.. థాయిలాండ్ ను (65-20), ఆతిథ్య బంగ్లాదేశ్ ను (43-18), జర్మనీ ను (63-22), ఉగాండా ను (51-16)లను ఓడించి సెమీస్కు చేరుకుంది. ఇక సెమీఫైనల్లో ఇరాన్ను 33-21 తేడాతో చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి ప్రపంచకప్ను గెలుచుకుంది.
Congratulations to our Indian Women’s Kabaddi Team for making the nation proud by winning the Kabaddi World Cup 2025! They have showcased outstanding grit, skills and dedication. Their victory will inspire countless youngsters to pursue Kabaddi, dream bigger and aim higher. pic.twitter.com/XRM8J2I2h0
— Narendra Modi (@narendramodi) November 24, 2025
ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయినప్పటికి కూడా భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. బలమైన డిఫెన్స్, దూకుడైన ఆటతో మ్యాచ్లో ఫై చేయి సాధించింది. రీతూ నేగి సారథ్యంలో ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగిన భారత్ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా విజయం సాధించడం విశేషం.
ప్రపంచకప్ను గెలుచుకున్న భారత మహిళల కబడ్డీ జట్టు పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందలు తెలిపారు.