India tour of England 2025 : వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లు సంయుక్తంగా ప్రకటించాయి. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్కు కెప్టెన్గా రోహిత్ శర్మనే వ్యహరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ 2021లో చివరి సారిగా జరిగింది. అప్పుడు ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా, 2-2తో సిరీస్ సమమైంది.
Cristiano Ronaldo : యూట్యూబ్లో రొనాల్డో సంచలనం.. 90 నిమిషాల్లోనే మిలియన్..
షెడ్యూల్ ఇలా..
మొదటి టెస్టు : జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్లో
రెండో టెస్ట్ : జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్హామ్లో
మూడో టెస్ట్ : జూలై 10 నుంచి 14 వరకు లార్డ్స్లో
నాలుగో టెస్టు : జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్లో
ఐదో టెస్టు : జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్లో
Announced! 🥁
A look at #TeamIndia‘s fixtures for the 5⃣-match Test series against England in 2025 🙌#ENGvIND pic.twitter.com/wS9ZCVbKAt
— BCCI (@BCCI) August 22, 2024