Kolkata captain Shreyas Iyer : రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ.12 లక్షల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించడంతోనే అతడికి ఫైన్ వేసినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ స్లో ఓవర్కు పాల్పడింది. ఈ కారణంగా ఆ జట్టు కెప్టెన్ అయిన అయ్యర్కు జరిమానా పడింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ అయ్యర్ కు రూ.12లక్షల ఫైన్ వేశారు. మరోసారి ఇదే తప్పు గనుక పునరావృతం అయితే మాత్రం అప్పుడు కెప్టెన్ అయ్యర్కు రూ.24లక్షల జరిమానాతో పాటు ప్లేయింగ్ ఎలెవన్లోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25శాతం లేదంటే రూ.6లక్షలలో ఏదీ తక్కువ అయితే దాన్ని ఫైన్గా వేస్తారు.
Kris Srikkanth : ఆర్సీబీ గెలవాలంటే.. 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. కోహ్లి బౌలింగ్
కాగా.. ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వరుసగా రెండు సార్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నాడు. మూడోసారి కూడాఈ తప్పిదానికి పాల్పడిదే పంత్ పై ఓ మ్యాచ్ నిషేదం పడే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సునీల్ నరైన్ (109; 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సరిగ్గా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
RCB vs SRH : సన్రైజర్స్తో బెంగళూరు మ్యాచ్.. బెంచీపై రూ.47 కోట్లు..