Jack Leach has been ruled out of the remainder Test series with India
IND vs ENG : టీమ్ఇండియాతో మూడో టెస్టు మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ మిగిలిన టెస్టు సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో లీచ్ గాయపడ్డాడు. అతడి మోకాలికి గాయమైంది. దీంతో అతడు విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆడలేదు. అతడు కోలుకుని మూడో టెస్టు మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని భావిస్తుండగా సిరీస్ మొత్తానికే దూరం కావడం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
అతడి బదులు మరో ఆటగాడిని ఎంపిక చేయడం లేదని ఈసీబీ చెప్పింది. మెరుగైన చికిత్స కోసం అతడు స్వదేశానికి రానున్నట్లు వెల్లడించింది. ‘అబుదాబీ నుంచి మరో 24 గంటల్లో లీచ్ ఇంగ్లాండ్కు బయలు దేరుతాడు. సోమర్సెట్, ఇంగ్లాండ్ బోర్డు వైద్యుల బృందం అతడిని పర్యవేక్షించనుంది. కొన్ని రోజుల రిహాబిలిటేషన్లో ఉంటాడు.’ అని ఈసీబీ తెలిపింది.
We’re all with you, Leachy ❤️
Nobody braver than you 💪Jack Leach has been ruled out of the remainder of our Test series with India.#INDvENG | #EnglandCricket
— England Cricket (@englandcricket) February 11, 2024
ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టులో ఉన్న స్పిన్నర్లలో లీచ్ మాత్రమే సీనియర్ స్పిన్నర్ కావడం గమనార్హం. అతడి గైర్హజరీలో యువ ఆటగాళ్లు టామ్ హర్ట్లే, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్లు స్పిన్ భారాన్ని మోయనున్నారు. ఉప్పల్ టెస్టులో హార్ట్లే ఏడు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ యువ ఆటగాడిపై ఇంగ్లాండ్ భారీ ఆశలే పెట్టుకుంది.
Viral Video : బ్యాటర్ ఏదో కనికట్టు చేసినట్లు ఉన్నాడుగా..!
ఇదిలా ఉంటే.. రెండో టెస్టు ముగిసిన తరువాత కెప్టెన్ స్టోక్స్తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అబుదాబీకి వెళ్లారు. అక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం (ఫిబ్రవరి 15) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. మూడో టెస్టులో విజయం సాధించింది ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.