Japan Open Lakshya Sen and Satwik-Chirag knocked out of Japan Open in second round
జపాన్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కలిసిరావడం లేదు. టోక్యో వేదికగా గురువారం జరిగిన సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ లక్ష్య సేన్, డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి రెండో రౌండ్లో ఓడిపోయింది.
పురుషుల సింగ్స్లో రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన లక్ష్య సేన్ ఓడిపోయాడు. 19-21, 11-21 తేడాతో జపాన్కు చెందిన కోడై నరోకా చేతితో ఓటమిని చవిచూశాడు. ఇదే టోర్నీలో తొలి రౌండ్లో చైనాకు చెందిన వాంగ్ జెంగ్ జింగ్పై 21-11, 21-18 తేడాతో విజయం సాధించినా ఆ జోరును కొనసాగించడంలో లక్ష్య సేన్ విఫలమయ్యాడు. దీంతో అతడు జపాన్ సూపర్ 750 టోర్నీ నుంచి నిష్ర్కమించారు.
Just in: Lakshya Sen crashes OUT in the 2nd round of Japan Open (Super 750).
Lakshya lost to WR 7 Kodai Naraoka 19-21, 11-21. #JapanOpen2025 pic.twitter.com/pNmvdZjA1H
— India_AllSports (@India_AllSports) July 17, 2025
ఇక డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 22-24, 14-21 తేడాతో ఐదో సీడ్ చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్- వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయింది. దాదాపు 44 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలు వీ కెంగ్- వాంగ్ చాంగ్ జోడీ భారత జట్టు పై తమ ఆధిక్యాన్ని 7-2కి పెంచుకుంది.
Just in: Satwik & Chirag knocked OUT in the 2nd round of Men’s Doubles at Japan Open (Super 750).
The Indian duo lost to former WR 1 & reigning Olympic medalists Liang Weikeng & Wang Chang 22-24, 14-21. #JapanOpen2025 pic.twitter.com/wqOJkKJUmZ
— India_AllSports (@India_AllSports) July 17, 2025