×
Ad

Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్

ఒలింపిక్ పతక విజేత పివి సింధు మలేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ఓడిపోయాడు.

  • Published On : July 1, 2022 / 09:35 PM IST

Malaysia Open 2022 Pv Sindhu, Hs Prannoy Crash Out In Quarterfinals

Malaysia Open 2022 : రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మలేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడు గేమ్‌ల పోటీలో టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, చైనీస్ తైపీకి చెందిన రెండో సీడ్ తాయ్ ట్జు యింగ్‌ చేతిలో సింధు ఓడింది. మొత్తం 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 13-21, 21-15, 21-13 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

చైనీస్ తైపీ షట్లర్ భారత ఏస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్‌లో 16-5 ఆధిక్యంలో నిలిచింది. సింధు తై ట్జుతో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓపెనింగ్ గేమ్‌లో నెమ్మదిగా ఆరంభించి 2-5తో సింధు వెనుకబడింది. చైనీస్ తైపీ షట్లర్ సుదీర్ఘ ర్యాలీలతో దూకుడుగా ఆడింది. అయితే సింధు ఓపెనింగ్ గేమ్‌ను ఆడిన సింధు రెండో గేమ్‌లో అద్భుతంగా రాణించింది. విరామ సమయానికి 11-3తో ఆధిక్యంలో నిలిచింది.

తాయ్ ట్జు అదే పంథాలో కొనసాగింది తన ఆధిక్యాన్ని 14-3కి సాగించింది. సింధును ఒత్తిడిలోకి నెట్టడానికి ముందు తాయ్ ట్జు మూడో గేమ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్‌ఎస్ ప్రణయ్ 18-21, 16-21తో సింగపూర్‌కు చెందిన జొనాటన్ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు. వీళ్లిద్దరూ నిష్క్రమించడంతో మలేషియా ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది.

Read Also : PV Sindhu : పీవీ సింధు ఓటమి… అయినా పతకం