Pakistan Cricket Fans: కోహ్లీకి పాక్ అభిమానుల విజ్ఞప్తి .. అలాచేస్తే బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారట ..

ముల్తాన్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. కోహ్లీ.. మీరు అలా చేస్తే మిమ్మల్ని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.

Pakistan Cricket Fans: పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ సందేశాన్ని పంపించారు. కోహ్లీ… మీరు అలా చేస్తే మిమ్మల్ని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సిరీస్ లో పాకిస్థాన్ కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు రావల్పిండి టెస్టు లో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ సందర్భంగా కొందరు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ప్లకార్డులతో కోహ్లీకి విజ్ఞప్తి చేశారు.

India vs Pakistan T20 Match: పాక్‌పై విజయంతో రికార్డుల మోతమోగించిన టీమిండియా.. అవేమిటో తెలుసా!

ముల్తాన్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. ‘హాయ్! కింగ్ కోహ్లీ పాకిస్థాన్ కు వచ్చి ఆసియాకప్‌లో ఆడండి.. మేము మిమ్మల్ని బాబర్ ఆజమ్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

2023లో పాకిస్థాన్‌లో ఆసియా‌కప్ టోర్నీ జరుగుతుంది. పాక్ లో జరగనున్న ఆసియాకప్ ను తటస్థ వేధికలో నిర్వహించాలని బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు. ఒకవేళ పాకిస్థాన్ లోనే ఆడాలంటే భారత్ జట్టు ఆ టోర్నీలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పాడు. అప్పటి నుంచి పాకిస్థాన్, ఇండియా క్రికెట్ బోర్డు సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకవేళ ఆసియా కప్ లో భారత్ జట్టు ఆడకుంటే.. 2023లో భారత్ సారథ్యం వహించే ప్రపంచ కప్ టోర్నీని పాకిస్థాన్ జట్టు బహిష్కరిస్తుందని పాక్ క్రికెట్ బోర్డు హెచ్చరింది. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కోహ్లీకి విజ్ఞప్తులు చేయడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు