India vs Pakistan T20 Match: పాక్పై విజయంతో రికార్డుల మోతమోగించిన టీమిండియా.. అవేమిటో తెలుసా!
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
India vs Pakistan T20 Match: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. తొలి ఓవర్ నుంచి 15 ఓవర్ల వరకు పాకిస్థాన్ జట్టే గెలుస్తుందని అందరూ భావించారు. కానీ టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, హార్థిక్ పటేల్ బలమైన భాగస్వామ్యతో పాక్ ఆశలపై నీళ్లు చల్లారు. హార్ధిక్ అవుట్ అయినా కోహ్లీ చివరి వరకు నిలబడి అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ వర్సెస్ పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు అనేక రికార్డులను అధిగమించింది.
→ 2020లో పాకిస్తాన్ 29 మ్యాచ్లలో 20 విజయాలను సాధించింది. ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును పాకిస్తాన్ కలిగి ఉంది.
→ ఆదివారం జరిగిన పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్తో టీమిండియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది (2022) భారత్ మొత్తం 29 టీ20 మ్యాచ్లు ఆడింది. అందులో 21 విజయాలను సాధించింది.
→ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై విజయంతో టీ20 ఫార్మాట్లో భారత్ ఏడు మ్యాచ్లలో 6సార్లు పాక్పై విజయం సాధించింది. ఒక్క మ్యాచ్లో పాక్ విజయం సాధించింది.
→ భారతదేశం ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్ మ్యాచ్లలో 39వ విజయాన్ని నమోదు చేసుకుంది. 2017లో దానిమునుపటి అత్యుత్తమ 37 విజయాలను అధిగమించింది.
→ విరాట్ కోహ్లీ పాక్పై మ్యాచ్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
– అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లి (3,794) నిలిచాడు.
→ ఆ తరువాతి స్థానంలో రోహిత్ శర్మ(3,741), న్యూజిలాండ్ వెటరన్ మార్టిన్ గప్టిల్ (3,531), పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ (3,231), ఐరిష్ వెటరన్ పాల్ స్టిర్లింగ్ (3,119) ఉన్నారు.
→ కంగారూ గడ్డపై టీ20ల్లో 500పైగా పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా యేతర ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
→ అంతర్జాతీయ టీ20లో వెయ్యి పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్ధిక్ రికార్డు సృష్టించాడు.
→ పాకిస్థాన్పై కోహ్లీ, హార్ధిక్ అయిదో వికెట్ భాగస్వామ్యం (113). టీ20ల్లో పాక్ జట్టుపై ఏ వికెట్కైనా టీమిండియాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
→ ఐసీసీ టోర్నీల్లో కోహ్లి 50కిపైగా స్కోర్లు చేసిన సందర్భాలు 24సార్లు. సచిన్ (23)ను అధిగమించాడు.
→ పాక్పై విజయంతో భారత్ T20 ప్రపంచ కప్లో గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉంది.