Parupalli Kashyap Introduced Himself As Saina Nehwal Husband Dhoni Reply Left Him Stunned
MS Dhoni – Parupalli Kashyap : భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ఇటీవల దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని కలిశాడు. ఈ సందర్భంగా ధోని తనతో ఎలా మాట్లాడాడు అన్న విషయాలను ఇటీవల ఓ పాడ్ కాస్ట్లో కశ్యప్ వెల్లడించాడు. మాజీ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన కశ్యప్ మాజీ ప్రపంచ నంబర్ 1 షట్లర్ అయిన సైనా నెహ్వాల్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఓ పెళ్లిలో ధోనిని కలిసే అవకాశం వచ్చిందన్నాడు. ధోనీ అతడిని బ్యాడ్మింటన్ ప్లేయర్గా గుర్తించకపోవచ్చని భావించి, కశ్యప్ తనను తాను సైనా భర్తగా పరిచయం చేసుకున్నాడు. అప్పుడు ధోని నుంచి వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందని కశ్యప్ చెప్పాడు. తనను గుర్తు పట్టుడమే కాకుండా ఓ స్నేహితుడి మాదిరిగా మాట్లాడాడని తెలిపాడు.
India vs Srilanka 2024 : భారత్-శ్రీలంక షెడ్యూల్లో మార్పులు.. సవరించిన కొత్త షెడ్యూల్ ఇదే..
‘నేను ఇటీవల ఒక పెళ్లిలో ధోనిని కలిశాను. క్రీడలను అనుసరించే కొంతమంది నన్ను గుర్తించవచ్చు. కానీ చాలా మంది గుర్తుపట్టరు. అలాగే భావించి సైనా భర్తగా పరిచయం చేసుకున్నాను. ఎందుకంటే నేను ధోనికి వీరాభిమానిని.’ అని కశ్యప్ చెప్పాడు. అప్పుడు .. ‘నువ్వు ఎవరో నాకు తెలుసు. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నువ్వు సైనా భర్తవని నాకు చెప్పాల్సిన అవసరం లేదు.’ అని ధోని అన్నట్లుగా కశ్యప్ తెలిపాడు. ఓ స్నేహితుడిలా ధోని తనతో మాట్లాడాడని అన్నాడు.
ధోనిని అభిమానులు ముద్దుగా కెప్టెన్ కూల్, తలా అని పిలుచుకుంటారు. టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను ధోని అందించాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు టైటిళ్లను అందించాడు. తన కెరీర్లో టీమ్ఇండియా తరుపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
Team India : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి భారత్ వైదొలిగితే..? లంకకు గోల్డెన్ ఛాన్స్..