ఐపీఎల్-2024లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 67 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సులతో శతకం సాధించాడు. ఐపీఎల్-2024లో ఇదే మొదటి సెంచరీ. ఐపీఎల్లలో విరాట్ కోహ్లీకి ఇది ఎనిమిదో శతకం.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు
కాగా, టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113(నాటౌట్), డుప్లెసిస్ 44, గ్లెన్ మ్యాక్స్వెల్ 1, సౌరభ్ చౌహన్ 9, గ్రీన్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 2, బర్గర్ ఒక వికట్ తీశారు.
బెంగళూరు జట్టు: డుప్లెసిస్, కోహ్లీ, రజత్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, చౌహాన్, రీస్ టాప్లీ, మయాంక్ దగార్, సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ జట్టు: సంజూ శాంసన్, జైస్వాల్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, ధ్రువ్, షిమ్రాన్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నాంద్రి బర్గర్, యజువేంద్ర చాహెల్
MS Dhoni : 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్కు రావాలా? ఏంటిది రుతురాజ్..? కాస్త ముందు పంపవయ్యా!