Shreyas Iyer : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నీ సందడి మొదలైంది. ఈనెల 22న మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ధోనీ, రోహిత్, విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్లు తమతమ జట్టు శిబిరాల్లో చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా తమ జట్టు సభ్యులతో చేరాడు. అయ్యర్ ఇటీవల ముంబై జట్టు తరపున రంజీ ఫైనల్ లో ఆడాడు. ఆ జట్టు 42వ సారి ట్రోపీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అయ్యర్ ఫైనల్ మ్యాచ్ లో 95 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ, వెన్నునొప్పి కారణంగా ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. దీంతో ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ ఆడుతాడా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అవన్నీ పుకార్లేనని శ్రేయాస్ ఫిట్ గా ఉన్న వీడియోను కేకేఆర్ జట్టు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. తాజాగా సోమవారం రాత్రి శ్రేయాస్ జట్టు సభ్యులతో కలిశాడు.
Also Read : PSL 2024 Prize Money: పాక్లో అంత తక్కువా..! పీఎస్ఎల్ టోర్నీలో విజేత జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?
మరో మూడు రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. సోమవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ అన్ ప్లగ్డ్ ఈవెంట్ తో క్రికెట్ సీజన్ ను ప్రారంభించింది. ఈ ఈవెంట్ లో టీం మెంటర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కేకేఆర్ టీంకోచ్ చంద్రకాంత్, ఇతర జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కేకేఆర్ న్యూ జెర్సీని ఆవిష్కరించారు. శ్రేయాస్ అయ్యర్ ఈ వెంట్ లో పాల్గొనేందుకు వచ్చే సమయంలో కేకేఆర్ జట్టు అభిమానులు శ్రేయస్.. శ్రేయాస్ అంటూ పెద్దపెట్టున కేకలు పెడుతూ సందడి చేశారు. శ్రేయాస్ వారి వద్దకు వెళ్లగా షేక్హ్యాండ్ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో 103 మ్యాచ్ లు ఆడగా.. 2,776 పరుగులు చేశాడు.
The craze for Shreyas Iyer at the Knights Unplugged event. 🔥 pic.twitter.com/N6URajXqS7
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024