టీ20 ప్రపంచకప్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో బార్బడోస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. రెండో సారి ట్రోఫీని ముద్దాడాలని భారత్ బావిస్తుండగా, తొలిసారి ఫైనల్కు చేరుకున్న దక్షిణాఫ్రికా కన్నీళ్లతో కాకుండా ఆనంద బాష్పాలతో ఇంటికి వెళ్లాలని పట్టుదలగా ఉంది. కాగా.. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు భారీగా ప్రైజ్మనీ దక్కనుంది.
గత టీ 20 ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే ఈ సారి ప్రైజ్మనీ గణనీయంగా పెరిగింది. కాగా.. టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీని ఐసీసీ 11.25 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా ప్రకటించింది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 93 కోట్ల రూపాయలు. విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.20.42 కోట్లు లభించనున్నాయి. అలాగే రన్నరప్కు రూ.10.67 కోట్లు దక్కనుంది.
INDW vs SAW : 90 ఏళ్ల మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా సరికొత్త రికార్డు..
సెమీస్లో ఓడిపోయిన రెండు జట్లు అఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్లకు చెరో రూ.6.5 కోట్లు ప్రైజ్మనీగా దక్కుతుంది. ఇక సూపర్ 8 దశ నుంచే ఇంటి బాట పట్టిన అమెరికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్లకు తలా రూ.3.17 కోట్లు లభిస్తాయి. ఇక గ్రూపు దశ నుంచే నిష్ర్కమించిన జట్లకు ప్రయోజనం చేకూరనుంది. 9 నుంచి 12వ ర్యాంక్లో నిలిచిన జట్లకు రూ.2.5కోట్లు అలాగే 13 నుంచి 20వ ర్యాంక్లో నిలిచిన జట్లకు రూ.1.87కోట్లు ప్రైజ్మనీగా దక్కనుంది.
ఒక్క మ్యాచ్ గెలిస్తే రూ.26 లక్షలు..
పొట్టి ప్రపంచకప్లో గెలిచిన ఒక్కొ మ్యాచుకు రూ.26లక్షలు ఇస్తామని ఐసీసీ తెలిపింది. ప్రైజ్మనీతో పాటు జట్లు ఎన్ని మ్యాచులు గెలిచాయో అన్ని మ్యాచులకు ఒక్కొ మ్యాచ్ కింద రూ.26 లక్షలు అదనంగా దక్కనున్నాయి.
IND vs SA : అయ్యో రామచంద్ర.. ఈ అంఫైర్ ఉన్నాడంటే టీమ్ఇండియా పని గోవిందా..? ఇప్పుడెలా..?