Virat kohli : హాలిడే ట్రిప్.. కుమార్తె వామికతో కలిసి లండన్‌లో కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో వైరల్

వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ బ్యాట్ తో పరుగుల వరద పారించాడు. ఈ సందర్భంగా మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శనకుగాను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు.

Virat kohli and Anushka sharma

Virat kohli And Anushka sharma : భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌లో హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. స్వదేశంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కు భారత్ జట్టు సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి గడిపే సమయం దొరకడంతో విరాట్ కోహ్లీ లండన్ ట్రిప్ వెళ్లాడు. భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి లండన్ కు హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. ఈ క్రమంలో లండన్ విమానాశ్రయంలో కుమార్తె వామికాతో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Team India : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త టీ20, టెస్టు, వ‌న్డే జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌ .. టెస్టుల‌కే ప‌రిమిత‌మైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ బ్యాట్ తో పరుగుల వరద పారించాడు. ఈ సందర్భంగా మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శనకుగాను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. ప్రస్తుతం భారత్ లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ లో కోహ్లీ, విరాట్ వంటి ప్లేయర్లకు విశ్రాంతి లభించింది. గురువారం బీసీసీఐ దక్షిణాఫ్రికా టూర్ కు సంబంధించిన జట్టును ప్రకటించింది. రోహిత్, కోహ్లీకి టీ20, వన్డే సిరీస్ లలో బీసీసీఐ అవకాశం కల్పించలేదు. విశ్రాంతినిచ్చింది. ఈ రెండు సిరీస్ ల తరువాత జరిగే టెస్ట్ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడనున్నారు.

Also Read : Gautam Gambhir : ద్ర‌విడ్ కాంట్రాక్ట్ పొడిగింపు పై గంభీర్‌.. ‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ద‌గ్గ‌ర ప‌డుతున్న ఈ స‌మ‌యంలో..’

ఈ క్రమంలో కోహ్లీకి చాలా సమయం ఉండటంతో కుమార్తె, భార్యతో కలిసి లండన్ విహారయాత్రకు వెళ్లాడు. లండన్ పర్యటనలో భాగంగా లండన్ విమానాశ్రయంలో కోహ్లీ అభిమానులతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు