Gautam Gambhir Viral Video: మైదానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ప్రేక్షకులకు చూపుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిశాక గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని మైదానంలోకి వెళ్లారు. ప్రేక్షకులకు శ్రీలంక జెండా చూపారు. దీంతో శ్రీలంక అభిమానులు ఖుషీ అయ్యారు.
ఇందుకు సంబంధించిన వీడియోను గౌతం గంభీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘సూపర్ స్టార్ టీమ్… కప్పు అందుకునేందుకు అర్హత ఉంది’ అని పేర్కొన్నారు. శ్రీలంకకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపారు. గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ఉన్న వీడియో శ్రీలంక అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. కాగా, పాకిస్థాన్ గెలుస్తుందని అందరూ భావించిన ఈ మ్యాచులో శ్రీలంక గెలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది. శ్రీలంకకు పలువురు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.
Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe
— Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022
COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు